News December 5, 2024
పుష్ప-2పై విశాఖ జనసేన నేత ట్వీట్
పుష్ప-2 హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప-2 బెనిఫిట్ షోలు వేసుకొనడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన, చేస్తున్న కృషి.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా తన స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది. YCP ప్రభుత్వం ఉంటే నిర్మాతలతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి పడేది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 23, 2025
విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
విశాఖ ఏఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.
News January 23, 2025
మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి
విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.
News January 23, 2025
విశాఖ: వలస వచ్చి విగత జీవులయ్యారు..!
బతుకుతెరువుకు ఊరొదిలి వచ్చిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి దంపతులు పార్వతీపురం జిల్లా నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమను కర్రివానిపాలెం హైస్కూల్లో చదివిస్తున్నారు.