News April 1, 2025

పుస్తకాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే: RSP

image

ఎస్సీ సబ్ ప్లాన్ కింద రావాల్సిన రూ.35,000 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదని BRS నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. HYD పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామాంతపూర్లో పేద దళిత, గిరిజన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని అడిగితే నిధులు లేవని అనటం, ప్రభుత్వం నిర్లక్ష్యమని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News October 29, 2025

MBNRలో భారీ వర్షం..ఈ మెసేజ్ వచ్చిందా?

image

ఉమ్మడి జిల్లాలోని MBNR, GDWL, WNPT,NRPT జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?

News October 29, 2025

VKB: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి అన్నారు.
✒పాతబడిన ఇండ్లు,శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవ్వరూ కూడా ఉండవద్దు.
✒వాగులను, కాలువలను, రోడ్డులను దాటే ప్రయత్నం చేయవద్దు
✒ఏదైనా అత్యవసరం ఉంటే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్స్ అధికారులకు గాని, డైల్ 100కి గాని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670056కు కాల్ చేయాలన్నారు.

News October 29, 2025

సిద్దిపేటలో కంట్రోల్ రూమ్‌.. ‘ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి’

image

భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఎమర్జెన్సీ నంబర్ 08457-230000కు కాల్ చేయాలని సూచించారు. బుధవారం ఆర్డీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.