News March 22, 2025

పూడూరు: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కలెక్టర్

image

పూడూరు మండల జాతీయ రహదారి పక్కన హైవేపై 20 ఎకరాల స్థలాన్ని చిరు వ్యాపారులకు అందించాలని వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు 20 ఎకరాల స్థలం కోసం కసరత్తులు ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు నగరాలకు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులకు స్థలం కేటాయిస్తే వారి వ్యాపారం వారే చేసుకోవచ్చు.

Similar News

News February 25, 2026

ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన

image

పటిష్ఠ బందోబస్తు నడుమ సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల శంకుస్థాపన కోసం దోర్నాల మండలం గంటవానిపల్లి పల్లికి విచ్చారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పటిష్ఠమైన ప్రణాళిక, వివిధ శాఖల సమన్వయంతో పోలీసులు సీఎం పర్యటనను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

News February 25, 2026

ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం: కలెక్టర్

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖ, మున్సిపల్, రోడ్డు భవనాలు, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులతో పీఎం రాహత్ పథకంపై ఆమె సమీక్షించారు. ప్రమాదం జరిగిన 7 రోజుల్లోనే ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News February 25, 2026

మోదీ ఇజ్రాయెల్ ట్రిప్‌పై రాహుల్ విమర్శలు

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్‌స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌‌లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.