News May 19, 2024
పూతలపట్టు: స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత

పూతలపట్టు మండలం ఎస్.వి సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుతో కలిసి ఎస్.వి.సెట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత చేసినట్లు చెప్పారు.
Similar News
News October 30, 2025
తుఫాన్ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

చిత్తూరు: మొంథా తుఫాన్ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.


