News March 10, 2025
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

వడ్డాది కేఏడీ జడ్పీ హైస్కూల్లో 2008-09 విద్యా సంవత్సరంలో టెన్త్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 16 ఏళ్ల తరువాత ఆదివారం కలిశారు. విద్య, ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా చదువుకున్న హైస్కూల్లో సమావేశమై నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఉల్లాసంగా గడిపారు. చదువు చెప్పిన గురువులను సత్కరించారు.
Similar News
News February 8, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు

విద్యాశాఖ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని డీఈవో ఏ రవిబాబు తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఆయన ప్రకటన విడుదల చేస్తూ ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు కొనసాగుతాయని ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎంలకు అప్పగించామన్నారు.
News February 8, 2026
నేడు నిర్మల్ జిల్లాకు రానున్న హీరోయిన్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఆదివారం భైంసాకు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారని పట్టణ అధ్యక్షుడు రావుల రాము తెలిపారు. అనంతరం ఆమె ఖానాపూర్ వెళ్తారని, ఈ పర్యటనను కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 8, 2026
మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు: భట్టి

TG: త్వరలో మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల గృహాలు నిర్మించామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, లేని వారికి జీ+2 తరహాలో నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు.


