News December 18, 2024
పూసపాటిరేగ: భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తం

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వాతావరణ కేంద్రం జిల్లాకు వచ్చే మూడు రోజుల్లో భారీవర్షాల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో ఇప్పటికే వరి పంట కోతలు పూర్తిచేసి కుప్పలుగా వేసిన ధాన్యం నూర్చవద్దని సూచిస్తున్నారు.
Similar News
News November 11, 2025
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.
News November 11, 2025
సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్రావు

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.
News November 11, 2025
పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.


