News May 18, 2024

పెంచలకోనకు ప్రత్యేక బస్సులు

image

పెంచలకోనలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. వెంకటగిరి, రాపూరు, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, రాజంపేట, బద్వేలు డిపోల నుంచి 120 బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులన్నీ 22న అందుబాటులో ఉంటాయని, మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా నడుపుతామన్నారు.

Similar News

News October 25, 2025

నుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

image

నుడా వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.

News October 24, 2025

వరి A గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర

image

కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధర(క్వింటాకు) ప్రకటించింది. వరికి A గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లించనున్నారు. మొక్కజొన్నకు రూ.2400, పత్తిపొడవు రకం రూ. 8110, మినుములు రూ.7800, పెసలు రూ.8768, కందులు రూ.8000, జొన్నలు రూ.3699, నువ్వులు రూ.9846, సజ్జలు రూ.2775, రాగులు రూ.4886, వేరుశనగకు రూ.7263 చొప్పున మద్దతు ధరలను ప్రకటించింది. పోస్టర్‌ను JC వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

News October 24, 2025

జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం: మంత్రి ఆనం

image

జిల్లాను అన్నీ రంగాల్లో ముందు నిలపాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ మంత్రిని కలిసి అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై, వర్షాలకు చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు.