News September 15, 2024
పెంచలకోనలో పవిత్రోత్సవాలు

రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం నుంచి బుధవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయసాగర్ బాబు తెలిపారు. మూడురోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, హోమములు, అభిషేకము, బుధవారం మహా పూర్ణాహుతి, మహా కుంభ ప్రోక్షణ జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Similar News
News January 10, 2026
నెల్లూరు ఎస్పీని అభినందించిన హోం మంత్రి

నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్లను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. నెల్లూరు జిల్లా జైలును ఆమె తనిఖీ చేశారు. జిల్లాలో మంచి సంస్కృతి నెలకొందని చెప్పారు. రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్, రప్పా రప్పా అంటూ కత్తులతో తిరిగే బ్యాచ్ను రోడ్లమీద నడిపించడాన్ని మంత్రి అభినందించారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News January 9, 2026
నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
NLR: ఒక్క బండితో అక్రమాలు ఆగేది ఎలా?

నెల్లూరు జిల్లాలో 210క్వారీలు ఉండగా 111గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికారికంగా ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. కనీసం 4మండలాలకు ఓ పర్యవేక్షణ అధికారి ఉంటేనే వీటిపై ఫోకస్ చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో ఆరుగురే ఉండగా.. తనిఖీలకు వెళ్లడానికి ఒకే ఒక వాహనం ఉంది. మైనింగ్ డిప్యూటీ డెరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండగా గూడూరు AD శ్రీనివాసరావు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. ఇలాగైతే అక్రమాలను ఎలా అడ్డుకోగలరు?


