News November 14, 2024
పెంచలకోనలో వైభవంగా నరసింహుని ఉత్సవం

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ద్వాదశి సందర్భంగా శ్రీవార్లకు నందనవనంలో అష్టోత్తర శత కలశాభిషేకం, సాలగ్రామ దాత్రి పూజలు నిర్వహించి వనభోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి బంగారు గరుడ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఉత్సవం జరిపారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
NLR: బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BVనగర్కు చెందిన వెంకటేశ్తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పిల్లలను బాగా చూసుకుంటానని అతను నమ్మించి కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసు నమోదైంది.
News September 17, 2025
కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.
News September 16, 2025
ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.