News February 21, 2025
పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ఆనం

రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 13వ స్థానంలో నెల్లూరు జిల్లా

టెన్త్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా 13వ స్థానంలో నిలించింది. మొత్తం 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు. 14,142 మంది అబ్బాయిలకుగాను 11,510 మంది, అమ్మాయిలు 14,133 మందికిగాను 12,123 మంది పాస్ అయ్యారు. కాగా 83.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

జమ్ము కశ్మీర్లో మంగళవారం టూరిస్ట్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.