News March 5, 2025
పెంచికల్పేట్: అనుమానంతోనే హత్య చేశాడు: CI

లోడుపల్లికి చెందిన గుర్లే లలిత పంట చేనులో హత్య విషయం తెలిసిందే. CI శ్రీనివాసరావు, SI కొమురయ్య కథనం ప్రకారం.. భర్త గణేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. పథకం ప్రకారం మామిడి తోటలో ఆమెను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులకు ఎదుట అంగీకరించాడు.
Similar News
News September 16, 2025
దీర్ఘకాలిక సంతోషానికి ఈ అలవాట్లు

* రోజూ 30 ని.ల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా, సైక్లింగ్) చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లు పెరుగుతాయి.
*7-9 గంటల నాణ్యమైన నిద్ర వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగై, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ధ్యానం చేయాలి.
* కుటుంబం, స్నేహితులు, సమాజంతో సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సంతోషాన్ని పొందవచ్చు.
* ఇతరులకు సహాయం చేయడం వల్ల పొందే సంతోషం, తమ కోసం ఖర్చు చేయడం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
News September 16, 2025
నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
News September 16, 2025
ఉమ్మడి కృష్ణాలో మిగిలిపోయిన 10 టీచర్ పోస్టులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1198 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1208 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1198 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 10 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఈ నెల 19న వీరికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.