News January 29, 2025
పెంచికల్ పేట్ రేంజ్లో బర్డ్ వాక్ ఫెస్టివల్

కొమIరం భీమ్ జిల్లా కాగజ్నగర్ డివిజన్ పెంచికల్ పేట్ అటవీ శాఖ రేంజ్లో ఫిబ్రవరి 2న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో పాల్గొనేందుకు పక్షి ప్రేమికులు రూ.1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జంగిల్ సఫారి, రవాణా భోజన వసతి కల్పిస్తామన్నారు.
Similar News
News November 23, 2025
డీసీసీ అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి!

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి పర్వతగిరికి మొండి చేయి దక్కింది. మండలం నుంచి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ బొంపల్లి దేవేందర్ రావు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరి దారుల్లో వారు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, తీరా ఇతరులకు దక్కడంతో ఉసూరుమన్నారు. పర్వతగిరి వాసులు సైతం మండలానికి డీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించారు.
News November 23, 2025
MBNR:U-17,19..24న వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల,బాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలను ఈనెల 24న MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో (U-19) బోనఫైడ్,ఆధార్, నాలుగు ఎలిజిబిటి పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ అఫ్ రోజ్ (80199 70231)కు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 23, 2025
బాపట్ల: 2.50 లక్షల గోనె సంచులు సిద్ధం

ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. 1,200 వాహనాలు అవసరం కానున్నాయని అంచనా వేశామన్నారు. ఇప్పటికే 450 వాహనాలు పోర్టల్లో నమోదు చేసుకున్నారని, ప్రతి వాహనానికి జిపిఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 2.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. మిల్లర్ల వద్ద మరో 10లక్షల గోనె సంచులు ఉన్నాయన్నారు.


