News January 29, 2025
పెంచికల్ పేట్ రేంజ్లో బర్డ్ వాక్ ఫెస్టివల్

కొమIరం భీమ్ జిల్లా కాగజ్నగర్ డివిజన్ పెంచికల్ పేట్ అటవీ శాఖ రేంజ్లో ఫిబ్రవరి 2న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో పాల్గొనేందుకు పక్షి ప్రేమికులు రూ.1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జంగిల్ సఫారి, రవాణా భోజన వసతి కల్పిస్తామన్నారు.
Similar News
News November 25, 2025
మదనపల్లెలో KG టామాటా రూ.66

మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. వారం రోజులుగా రేట్లు బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్కు మంగళవారం 156 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. దిగుబడి తక్కువగా ఉండడంతో కాయల కొనుగోలుకు వ్యాపారాలు పోటీపడ్డారు. దీంతో 10కిలోల మొదటిరకం బాక్స్ రూ.660, రెండో రకం రూ.620, 3వ రకం రూ.540 చొప్పున అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు.
News November 25, 2025
సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సా.6.15 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News November 25, 2025
సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బీసీ సంఘాలు

పరకమణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు అన్నారు. విజయవాడ గాంధీనగర్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హత్య ఆత్మహత్య అన్నదానిపై పోలీసులు ఇప్పటివరకు తెలపలేదని, ప్రభుత్వం చేపట్టిన సీఐడి ఇన్వెస్టిగేషన్ నత్త నడకలు నడుస్తుందన్నారు. సతీష్ కుమార్ మృతి పై నిజాలు తెలపాలన్నారు.


