News February 17, 2025
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థుల వివరాలను సేకరించి ప్రస్తుత వారి స్థితిగతులపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరగా పరిష్కరించిన అధికారులకు సీపీ అభినందనలు తెలిపారు.
Similar News
News December 2, 2025
శబరి వెళ్లిన ప్రతి ఒక్కరూ 18 మెట్లు ఎక్కవచ్చా?

శబరిమలలో 18 పవిత్ర మెట్లను ముక్తికి సోపానాలుగా భావిస్తారు. ఇవి మనలోని 18 పాపపుణ్యాలు, విద్య, ఇంద్రియాలను సూచిస్తాయని నమ్మకం. వీటిని మండల కాల దీక్షా వ్రతం పూర్తిచేసినవారు మాత్రమే ఇరుముడి ధరించి, ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అధిరోహిస్తారు. దీక్ష ధరించకుండా, ఇరుముడి లేకుండా వచ్చిన భక్తులు ఈ మెట్లకు ప్రక్కన ఉన్న సాధారణ మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 2, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.
News December 2, 2025
ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>


