News March 19, 2025

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: బాపట్ల కలెక్టర్

image

ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. మంగళవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం జనవరి నుంచి ఇప్పటివరకు 2,399 దరఖాస్తులు రాగా, 382 పెండింగ్లో ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పృహతో పని చేయాలని హెచ్చరించారు.

Similar News

News December 5, 2025

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News December 5, 2025

సిరిసిల్ల: మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

నా ఓరుగల్లు.. కాకతీయులు ఏలిన నేల!

image

కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ నేలను మర్చిపోరు. ఈ నేలపై ఓరుగల్లు ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ కలుసుకున్నా జిల్లా బంధం ఇట్టే కలిపేస్తుంది. ఎక్కడున్నా ఓరుగల్లు భాష దగ్గరికి చేరుస్తుంది. అంతేకాదు.. ఓరుగల్లును, పంట భూములను భద్రకాళి, సమ్మక్క-సారలమ్మ, రుద్రేశ్వర స్వామి వార్లే కాపాడతారని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నేడు ప్రపంచ నేల దినోత్సం. SHARE