News March 19, 2025

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: బాపట్ల కలెక్టర్

image

ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. మంగళవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం జనవరి నుంచి ఇప్పటివరకు 2,399 దరఖాస్తులు రాగా, 382 పెండింగ్లో ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పృహతో పని చేయాలని హెచ్చరించారు.

Similar News

News December 5, 2025

సిద్దిపేట: ప్రభుత్వాన్ని బీసీ సమాజం క్షమించదు: హరీష్ రావు

image

బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర చారి బలైపోవడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. రేవంత్ అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని ‘X’లో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.

News December 5, 2025

సిద్దిపేట: కలెక్టర్‌ను కలిసిన స్వయం సహాయక సభ్యులు

image

స్వయం సహాయక సంఘా సభ్యులు Event Management పై National Institute of Tourism and Hospitality Management(NITHM) హైదరాబాద్‌లో 5 రోజులు పాటు శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆరుగురు స్వయం సహాయక సభ్యులు బాలలక్ష్మి, మంజుల, శ్వేతాకళ, భూలక్ష్మి, శిరీష, లావణ్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి పలు రకాల యూనిట్లకు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు.

News December 5, 2025

సిద్దిపేట: ఉమిద్ పోర్టల్‌లో ఆస్తుల నమోదు

image

ఉమిద్ పోర్టల్‌లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్‌పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్‌లో నమోదు చేశారు.