News January 28, 2025

పెండింగ్ ధరణి దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో రికార్డు రూంను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీసి, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా మీ-సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కుల, ఆదాయ, జనన ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.

Similar News

News October 29, 2025

NZB: నా వెనుక ఎవరూ లేరు: ఎమ్మెల్సీ కవిత

image

తాను ఇండిపెండెంట్ నని, తన వెనుక ఎవరు లేరని, తన ముందు ప్రజలు ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయన్నారు. తన నడక ద్వారా తన స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. తాను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు.

News October 29, 2025

వైఫల్యాలు విజయాలకు మెట్లు!

image

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.

News October 29, 2025

రాచకొండ: AR కానిస్టేబుల్ చరణ్ మృతి

image

రాచకొండ ఏఆర్ కానిస్టేబుల్ V.చరణ్ కుమార్ (34)మృతి చెందారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిప్యూటేషన్‌లో ఉన్న ఆయన ఇటీవల ముంబై ఆపరేషన్‌ నుంచి తిరిగి వస్తూ గాయపడ్డారు. గాయం మానకపోవడంతో యశోద ఆసుపత్రిలో రెండుసార్లు చికిత్స చేయించుకున్నాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యిన కొద్ది సేపటికే ఇంట్లో మూర్ఛతో చనిపోయారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు యశోద ఆసుపత్రిలో ఆయనకు నివాళులర్పించారు. చరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.