News December 10, 2024

పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

image

ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉపాధ్యాయులకు దాదాపుగా 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.

Similar News

News January 6, 2026

ఓటర్ జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: NZB కలెక్టర్

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాబితా రూపొందించాలన్నారు.

News January 6, 2026

జక్రాన్‌పల్లి: ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

News January 6, 2026

NZB: పాముకాటుతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

మోపాల్ మండలం శివలాల్ తండాలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కేతావత్ రామచందర్(43)కు పొలంలో పనిచేస్తుండగా పాము కరిచింది. దీంతో అతన్ని NZBలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లడు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.