News July 23, 2024
పెండ్యాల్-హసన్పర్తి మధ్య బైపాస్ లైను భూసేకరణ

పెండ్యాల్(నష్కల్)-హసన్పర్తి రైల్వే స్టేషన్ మధ్య బైపాస్ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కోసం కేంద్ర రైల్వే శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ మౌలిక వసతుల కల్పనలో భాగంగా జనగామ జిల్లా, హన్మకొండ జిల్లాల్లో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు కింద ఈ భూసేకరణ చేపట్టనున్నట్లు అందులో తెలిపింది.
Similar News
News November 25, 2025
వరంగల్ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

వరంగల్ జిల్లాలోని 317 పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తిలోని 91 జీపీలకు, 2వ దశలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెంలోని 117 జీపీలకు, 3వ దశలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నరావుపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
News November 24, 2025
వరంగల్: చిన్నారి హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

మూడేళ్ల పాప ఫాతిమా సబాను హత్య చేసిన కేసులో నిందితురాలు హజీరా బేగం, ఆమె సహచరుడు సయ్యద్ యూసుఫ్కు యావజ్జీవ కారాగార శిక్షను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలాగీతాంబ సోమవారం విధించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు అవుతుందని 2022 ఏప్రిల్ 23న ఇద్దరూ కలిసి క్రూరంగా హతమార్చినట్లు సాక్ష్యాధారాలతో రుజువైనందున కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.


