News September 28, 2024
పెండ్లిమర్రి: గుంతలో పడి పశువుల కాపరి గల్లంతు

పెండ్లిమర్రి మండలంలోని బుడ్డాయ పల్లె సమీపంలోని మైన్స్ వద్ద ఉన్న గుంతల్లో పడి శనివారం ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. బుడ్డాయ పల్లెలోని బంధువుల ఇంటికి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి పశువులను మేపుకుంటూ మైన్స్ సమీపంలోని గుంతల వద్దకు వెళ్లాడు. పశువులను బయటికి తోలే క్రమంలో అదుపుతప్పి గుంతలో పడి గల్లంతయ్యాడు. పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News February 24, 2026
కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.


