News October 21, 2024
పెండ్లిమర్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

పెండ్లిమర్రి మండలంలోని పుణ్యక్షేత్రమైన పొలతలకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అదే మండలంలోని కొత్తపేటకు చెందిన మిథున్ రెడ్డి సోమవారం దైవదర్శనం కోసం పొలతలకు వెళ్ళాడు. అనంతరం బైకులో తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ను దాటి ముందుకు వెళుతూ అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పడ్డ అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News November 23, 2025
కడప: గ్రామ స్థాయికి వెళ్లని స్వచ్ఛాంధ్ర ప్రచారం?

ప్రతి నెలా 3వ శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ ప్రచారం చేసినా, గ్రామస్థాయిలో అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఆదివారం కమలాపురం మండలం <<18369261>>ఎర్రగుడిపాడులోని<<>> ఓ కాలనీ ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. దీనికి కారణం అక్కడి వారికి పారిశుద్ధ్యంపైన అవగాహన లేకపోవడమేనని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అధికారులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లట్లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.
News November 23, 2025
సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కడప జట్టు

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.
News November 23, 2025
మైదుకూరు: గౌడౌన్లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్పై అనుమానాలు

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.


