News October 21, 2024

పెండ్లిమర్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

పెండ్లిమర్రి మండలంలోని పుణ్యక్షేత్రమైన పొలతలకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అదే మండలంలోని కొత్తపేటకు చెందిన మిథున్ రెడ్డి సోమవారం దైవదర్శనం కోసం పొలతలకు వెళ్ళాడు. అనంతరం బైకులో తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ను దాటి ముందుకు వెళుతూ అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పడ్డ అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News December 4, 2025

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.

News December 4, 2025

కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్‌లు ఉన్నాయి.