News December 29, 2024
పెందుర్తి: ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

పెందుర్తి మండలం చినముషిడివాడ కార్మికనగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు హైదరాబాద్కు చెందిన పీవీ శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు ముందుగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. కాగా..శ్రీకాంత్ అదృశ్యం అయినట్లు శనివారం హైదరాబాదులో కేసు నమోదయింది.
Similar News
News November 6, 2025
11వ తేదీ నుంచి డాక్యార్డ్ బ్రిడ్జి పై రాకపోకలు: MLA

సరిగ్గా 20 నెలల క్రితం మూసివేసిన డాక్ యార్డ్ బ్రిడ్జి పోర్టు యాజమాన్యం సహకారంతో పునర్నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రాకపోకలు చేయవచ్చని తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్ని రహదారుల పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. భద్రత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
News November 6, 2025
సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.
News November 6, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.


