News November 5, 2024

పెందుర్తి: భూములు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు

image

విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను విశాఖ కలెక్టర్‌కు పంపించారు. 2021లో కేటాయించిన రూ.225 కోట్ల విలువచేసే 15 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

image

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.

News November 17, 2025

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

image

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.

News November 16, 2025

వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

image

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.