News April 1, 2025
పెదచెర్లోపల్లి: అధికారులతో కలెక్టర్ సమీక్ష

పెద చెర్లోపల్లి మండలంలో దివాకరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పర్యటించారు. గ్రామంలో బుధవారం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేశ్, అనంత్ అంబానీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్రతో కలసి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
Similar News
News April 25, 2025
చీరాల ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ!

ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.
News April 25, 2025
మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News April 25, 2025
పోలీసులకు సవాల్గా మారిన వీరయ్య హత్య కేసు?

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.