News February 26, 2025
పెదపూడి: శివరాత్రి ఉత్సవాల్లో యువకుడి మృతి

పెదపూడి మండలం కైకవోలులో శివరాత్రి ఉత్సవాలలో అపశ్రుతి చోటుచేసుకుంది. పెదపూడి ఎస్సై రామారావు వివరాల మేరకు.. మంగళవారం కైకవోలు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలకు విద్యుత్ అలంకరణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువకుడు గుర్తుల కాశీ విశ్వేశ్వరరావు (25) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News July 6, 2025
ప్రపంచంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న YouTube ఛానళ్లు ఇవే..

1.MrBeast (అమెరికా)- 411 మిలియన్లు
2.T-Series (ఇండియా)- 298 మి.
3.Cocomelon – Nursery Rhymes (అమెరికా)- 195 మి.
4.SET India (భారత్)- 185.1 మి.
5.Vlad and Niki (అమెరికా)- 142 మి.
6.Kids Diana Show (అమెరికా)- 135 మి.
7.Like Nastya (అమెరికా)- 128 మిలియన్లు
8.Stokes Twins (అమెరికా)- 128 మి.
9.Zee Music Company (భారత్)- 114 మి.
10.PewDiePie (జపాన్/స్వీడన్)- 111 మి.
News July 6, 2025
వికారాబాద్ జిల్లాలో కొత్తగా 8993 మంది

వికారాబాద్ జిల్లాలో గత నెలలో నిర్వహించిన బడిబాట సత్ఫలితాలు ఇవ్వడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1925 ఎక్కువగా అడ్మిషన్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి 8993 అడ్మిషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. గత సంవత్సరంలో 7,078 అడ్మిషన్లు వచ్చాయి. అయితే గవర్నమెంట్ టీచర్లు చేపట్టిన బడిబాటతో మంచి స్పందన వచ్చింది. సర్కారు కల్పించే సౌకర్యాలూ వివరిస్తూ వచ్చారు.
News July 6, 2025
పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.