News April 14, 2025
పెదబయలు: కుక్క కాటుకు విద్యార్థి మృతి

పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి విద్యార్థి మఠం ఆదిత్యరామచంద్రపడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్ చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్కకాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబీస్ లక్షణాలతో మృతి చెందినట్లు కుంటుంబ సభ్యులు అన్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News November 1, 2025
ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్కు అవకాశం దక్కేలా కోటా విధించారు.
News November 1, 2025
సంగారెడ్డి: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2025 జాబితాను 4 కేటగిరీలుగా విభజించినట్లు చెప్పారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసే మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.
News November 1, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోనీ ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఆ వివరాలను మండల విద్యాధికారుల ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.


