News April 14, 2025

పెదబయలు: కుక్క కాటుకు విద్యార్థి మృతి

image

పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి విద్యార్థి మఠం ఆదిత్యరామచంద్రపడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్ చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్కకాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబీస్ లక్షణాలతో మృతి చెందినట్లు కుంటుంబ సభ్యులు అన్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News April 19, 2025

ములుగు జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

◆ములుగు: పేదవాడి కన్నీరు తుడవడానికి భూభారతి: పొంగులేటి ◆ములుగు ఆసుపత్రిలో శిశువు మృతి.. కుటుంబీకుల ఆందోళన ◆ఏటూరునాగారం: అడవిలో సిగరెట్ తాగిన వ్యక్తికి జరిమానా ◆బిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వోలను వాడుకొని తొలగించింది: సీతక్క ◆కాకతీయుల పాలనకు నిదర్శనం రామప్ప ◆వెంకటాపూర్: దేశానికి వెన్నుముక రైతు: మంత్రి కొండా సురేఖ

News April 19, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@ ధరూరు : రేపు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక @ గద్వాల్ : మంత్రి రాక సభను పరీక్షించిన అధికారులు @ గద్వాల్ : బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి
@ గద్వాల్ : కోట చరిత్ర మీకు తెలుసా..
@ ఉండవల్లి : ఫ్లై ఓవర్ నిర్మించండి
@ అలంపూర్ : ప్రధాన రహదారిపై గుంత
@ కేటి దొడ్డి : మందకృష్ణ ఈనెల 27న రాక
@ గద్వాల్ : శక్తిపీఠంలో చండి హోమాలు.

News April 19, 2025

రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేరుస్తాం: రాజ్‌నాథ్

image

రక్షణ రంగంలో భారత్‌ స్వయం ప్రతిపత్తి సాధించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. MHలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాట్లాడుతూ ‘మేం 2014లో అధికారం చేపట్టినప్పుడు రక్షణ ఎగుమతులు రూ.600 కోట్ల వరకే జరిగేవి. ప్రస్తుతం రూ.24వేల కోట్లకు చేరాయి. ఇక్కడితో సంతృప్తిపడం. 2029-30 వరకు ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!