News March 21, 2025

పెదబయలు : మంచులో తేలుతున్న సూర్యుడు

image

పెదబయలు మండలం తూలం గ్రామ పరిసర కొండల్లో శుక్రవారం తెల్లవారుజామున పొగ మంచు కమ్మేసింది. అయితే తేలియాడే మేఘాలపై.. సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. పర్యాటక ప్రేమికులు ఉత్సాహంగా ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.

Similar News

News October 28, 2025

‘యూనిటీ మార్చ్‌’లో యువత చురుగ్గా పాల్గొనాలి: ఎంపీ అరవింద్

image

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘సర్దార్@150 యూనిటీ మార్చ్‌’లో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిలుపునిచ్చారు. దేశ ఏకత, సమగ్రతకు పటేల్‌ స్ఫూర్తినిచ్చారని, ఆయన ఆదర్శాలను యువత అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

News October 28, 2025

తిరుమల: 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు

image

తిరుమల శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. ఈసారి కూడా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అమలు చేస్తామని ప్రకటించారు. కేవలం 2రోజులే ఈ దర్శనాలకు భక్తులను అనుమతించాలన్న ఆలోచన తమది కాదని స్పష్టం చేశారు. తొక్కిసలాట జరగకుండా భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. కేవలం రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోందని భూమన ఆరోపించిన విషయం తెలిసిందే.

News October 28, 2025

జగిత్యాల: ‘సీనియర్ సీఆర్పీల సేవలు వినియోగించుకోవాలి’

image

వరంగల్ మహా సమాఖ్యకు చెందిన సీనియర్ సీఆర్పీల సేవలను వినియోగించుకోవాలని డిీఆర్డీఏ పీడీ రఘువరన్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు సెర్ప్ ఆధ్వర్యంలో మండల పదాధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఈవో ఆదేశాల మేరకు 16 మంది సీనియర్ సీఆర్పీలతో 16 మండలాల్లో, 16 మండల, 12 గ్రామ సమాఖ్యలకు ప్రత్యేక శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీడీ సునీత, డీపీఎంలు పాల్గొన్నారు.