News September 11, 2024

పెదమానాపురం హైవేపై లారీ బోల్తా

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం హైవేపై ఈరోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గడ్ నుంచి కంటకాపల్లి వైపు బొగ్గుతో వెళ్తున్న లారీ పెదమానాపురం ఆర్‌సీ‌ఎం చర్చి దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 4, 2026

బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

image

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్‌, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.