News October 10, 2024

పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి..UPDATE

image

పెదవేగిలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు కాలువలో పడి మృతి చెందారు. ఈ ఘటనలో మొదట తండ్రి, పెద్ద కుమారుడి మృతదేహం లభ్యం కాగా..ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బురదలో కూరుకుపోయిన సాయికుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోవడంతో తల్లి ఆవేదన ఆకాశాన్నంటుతోంది.

Similar News

News October 10, 2024

ఏలూరు జిల్లాకు 3 టన్నుల రాయితీ టమాటాలు

image

ఏలూరు జిల్లాకు మూడు టన్నుల రాయితీ టమాటాలు దిగుమతి చేయడం జరిగిందని బుధవారం మార్కెటింగ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఏలూరు నగరంలోని పత్తేబాద రైతు బజారుకు 1.50 టన్నులు, ఒకటో పట్టణ రైతు బజారుకు 750 కిలోలు, కైకలూరు రైతు బజారుకు 500 కిలోలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కిలో రూ.50 కి అమ్ముతారని, ప్రజలు గమనించాలని కోరారు.

News October 10, 2024

యర్నగూడెం జాతీయ రహదారిపై మంత్రి తనిఖీలు

image

దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. యర్నగూడెం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద లోడుతో వెళుతున్న లారీలను ఆపి పత్రాలను పరిశీలించారు. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అక్రమాలపై దృష్టి సారించిన మంత్రి మనోహర్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

News October 9, 2024

ఇళ్ల నిర్మాణాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం

image

ఏలూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణాల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రోజుకు 54 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.