News March 3, 2025

పెద్దకొత్తపల్లి: రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం

image

పెద్దకొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. సాతాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై రెండు బైక్‌లు ఢీకొనగా ముష్టిపల్లికి చెందిన సాంబశివుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుడికిల్లకి చెందిన జగదీశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదైనట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

Similar News

News March 26, 2025

VKB జిల్లాలో నేటి TOP NEWS..!

image

✔ VKB: ఇంగ్లిష్ పరీక్షకు 61 మంది డుమ్మా..! ✔ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: స్పీకర్ ✔VKB:బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు ✔VKB: GPO పోస్టులకు ఈనెల 26, 27న అవగాహన ✔పరిగిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు ✔ తాండూరు పుర సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ✔ పలుచోట్ల ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔VKB జిల్లాలో గ్రామాల పేర్ల మార్పుకు సిద్ధం: మంత్రి సీతక్క ✔కేబినెట్ విస్తరణ.. VKBకు NO ఛాన్స్?.

News March 26, 2025

రాత్రి చపాతి తింటున్నారా?

image

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.

News March 26, 2025

సుప్రీంకు చేరిన అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు

image

పోక్సో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘వక్షోజాలు పట్టుకోవడం, పైజామా నాడా తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మహిళా సమాజంతో పాటు న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఈ తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన సుప్రీం.. ఇవాళ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

error: Content is protected !!