News April 11, 2024

పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం.. బ్రిడ్డిపై మూలమలుపు ఉండటంతో బైక్ కంట్రోల్ కాకపోవడంతో కింద పడి మృతిచెందారు. మృతుడు లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన రాజలు(50)గా గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Similar News

News March 19, 2025

బాలానగర్‌: అంగన్వాడీ టీచర్ అదృశ్యం

image

ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలోని వనమోనిగూడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. లత గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 16న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 19, 2025

MBNR: పోక్సో కేసు.. నిందితుడికి జీవిత ఖైదు

image

ఓ నిందితుడికి పోక్సోకేసులో జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. 2020డిసెంబర్21న కోయిలకొండ PSలో దుప్పుల ఆనంద్ 14ఏళ్ల బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.  బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సోకేసు నమోదుచేశారు. నేరం రుజువవటంతో నిందితుడికి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజేశ్వరి తీర్పుఇచ్చారు. దీంతో ఎస్పీ జానకి PP, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

News March 19, 2025

MBNR: CMకు ‘THANK YOU’ తెలిపిన ఎమ్మెల్యేలు

image

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిఅవకాశాలను పెంచేందుకు రూ.6000 కోట్ల రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. MLAలు మధుసూదన్ రెడ్డి, పర్నికా రెడ్డి, మేఘారెడ్డి, ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.

error: Content is protected !!