News February 3, 2025

పెద్దగట్టులో భారీ బందోబస్తు

image

పెద్దగట్టు జాతరను పురస్కరించుకొని నిర్వహించిన దిష్టి పూజలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.  

Similar News

News October 25, 2025

మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.

News October 25, 2025

ప్రత్యేక సదరం క్యాంపుల నిర్వహణకు చర్యలు: దీపక్ తివారీ

image

జిల్లాలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పునరుద్ధరణ కొరకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి సెర్ప్ సిఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా అదనపు కలెక్టర్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కొరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.

News October 25, 2025

సంగారెడ్డి: ఇంటర్ సిలబస్‌లో మార్పులు

image

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. 20 ఇంటర్నల్, 80 ఎక్స్‌టర్నల్ పరీక్షల మార్కులు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పు చేసింది.