News January 31, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించాలని సీఎంకు వినతి

సూర్యాపేట జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.8, న్యాల్కల్ 8.2, సదాశివపేట 8.4,మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 9.9, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6,పోతారెడ్డిపేట 9.2, కొండపాక 9.7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు,బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


