News February 18, 2025
పెద్దగట్టు: లింగమంతుల స్వామికి MLC కవిత బోనం

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామిని మంగళవారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మహిళలు కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కవిత వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బాలరాజు, మద్ది శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News October 18, 2025
పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.