News February 12, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి కొనుగోళ్లు!

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పత్తి మార్కెట్లో కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. పత్తికి కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధర మాత్రమే అందుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.6,811 చొప్పున పలుకుతోంది.
Similar News
News October 30, 2025
ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
News October 30, 2025
రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.
News October 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

మెుంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, పశ్చి గోదావరి సర్కిళ్లలో ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొంది. తుఫాన్ కారణంగా GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం, తీరప్రాంతంలో కోత గురవడం వంటివి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు.


