News February 2, 2025
పెద్దపల్లిలో MLC కవిత రేపటి పర్యటన షెడ్యూల్

పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సోమవారం పర్యటించనున్నారు అని కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ నాయకులు రవి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 12PM పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు @12:15PM మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో TBGKS నాయకులతో ఆత్మీయ సమీక్షలో పాల్గొంటారు @12:30 మీడియా సమావేశంలో మాట్లాడతారు @1PM సబితం గ్రామంలో జరిగే ఓ వివాహా వేడుకలో పాల్గొంటారు.
Similar News
News September 15, 2025
ఉల్లితో కూలిన ఆశలు!

కర్నూలు మార్కెట్ యార్డు ఉల్లి నిల్వలతో నిండిపోయింది. మరోవైపు ధరలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం కిలో ఉల్లి ధర కేవలం 50 పైసలు. ఇక నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు క్వింటా రూ.50 నుంచి రూ.300 మించి కొనలేదు. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు చరిత్రలో ఇదే తొలిసారి. గతేడాది క్వింటా రూ.6వేల వరకు పలకడంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున సాగు చేశారు. ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తోంది.
News September 15, 2025
శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా 89,680 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 8000, కాకతీయ 3000, ఎస్కేప్ గేట్లు (రివర్) 5,000, సరస్వతి 800, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులకు చేరుకోగా 80.501 TMC నీరు నిల్వ ఉంది.
News September 15, 2025
నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.