News February 15, 2025

పెద్దపల్లి: అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణు సమీక్షించారు. గంజాయితో పాటు గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. గోదావరిఖనిలో 10 పడకల డీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏసీపీ కృష్ణ, రమేశ్, DAO ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

image

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.

News November 25, 2025

మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

image

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్‌లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.

News November 25, 2025

జనగామ: మూడు విడతల్లో పోలింగ్

image

జిల్లాలోని 280 గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లోని 74 గ్రామ పంచాయతీలు, 668 వార్డు, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని 117 గ్రామ పంచాయతీలు, 1,038 వార్డులు, మూడో విడతలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, జఫర్గడ్ మండలాల్లోని 89 గ్రామ పంచాయతీలు, 828 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.