News February 15, 2025

పెద్దపల్లి: అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణు సమీక్షించారు. గంజాయితో పాటు గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. గోదావరిఖనిలో 10 పడకల డీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏసీపీ కృష్ణ, రమేశ్, DAO ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 16, 2025

మహిళల ఆరోగ్యమే సమాజానికి ఆరోగ్యం: మంత్రి జూపల్లి

image

మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అవ‌ని ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో న‌వోద‌య కాల‌నీలోని (కూక‌ట్‌ప‌ల్లి) తుల‌సివ‌నం వ‌ద్ద‌ 5K ర‌న్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు కుటుంబంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 16, 2025

పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (1/2)

image

ప్రత్యేక రాష్ట్రమంటూ లేనప్పుడు తెలుగువారికి అన్నివైపులా అవమానాలే జరిగేవి. అది భరించలేకపోయిన పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించారు. మద్రాసు CM రాజాజీ వార్నింగ్ కారణంగా తెలుగు కాంగ్రెస్ వారెవరూ మద్దతుగా రాలేదు. ఒంటరైనా, పేగులు పుళ్లు పడి పురుగులు పట్టి అనుక్షణం నరకాన్ని చూస్తున్నా దీక్షను మాత్రం శ్రీరాములు ఆపలేదు. చివరికి 1952, డిసెంబరు 15న అమరుడయ్యారు.

News March 16, 2025

పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

image

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.

error: Content is protected !!