News March 22, 2025
పెద్దపల్లి: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి(అప్డేట్)

ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
వరల్డ్ క్లాస్ లెవెల్లో.. రూ.600 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.!

విజయవాడ రైల్వే స్టేషన్ను PPP మోడల్ కింద రూ.600 కోట్లకు పైగా నిధులతో వరల్డ్ క్లాస్ వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవగా, DEC 15తో గడువు ముగియనుంది. 24/7 వైఫై, AC హాల్స్, ప్రతి ప్లాట్ఫామ్పై ఎస్కలేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు వంటి అనేక హంగులతో స్టేషన్ను తీర్చిదిద్దనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మోడల్ కింద ఎంపికైన ఏకైక స్టేషన్ విజయవాడ అని అధికారులు తెలిపారు.
News November 14, 2025
జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న సిద్దిపేట ప్రజలు

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.
News November 14, 2025
రెండో రౌండ్లోనూ సేమ్ సీన్

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో నవీన్కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


