News March 22, 2025
పెద్దపల్లి: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
టీనేజర్ల కోసం ChatGPTలో సెక్యూరిటీ ఫీచర్లు!

టీనేజర్ల భద్రత, ప్రైవసీ కోసం ChatGPTలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తున్నట్లు OpenAI ప్రకటించింది. యూజర్లను వయసు ఆధారంగా 2 కేటగిరీలుగా (13-17, 18+) గుర్తించేందుకు age ప్రిడిక్షన్ సిస్టమ్ను తీసుకురానుంది. యూజర్ ఇంటరాక్షన్ను బట్టి వయసును అంచనా వేయనుంది. కొన్నిసార్లు ఏజ్ వెరిఫై కోసం ID కూడా అడుగుతుందని సంస్థ తెలిపింది. సూసైడ్ వంటి సెన్సిటివ్ అంశాలపై AI స్పందించదని వివరించింది.
News September 17, 2025
రాజమండ్రి : రాష్ట్ర సమాచార కేంద్రం ఏడీగా రామచంద్రరావు

ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఆర్.వి.ఎస్. రామచంద్రరావు పదోన్నతిపై రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణా చార్యులు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇన్ఛార్జి సహాయ సంచాలకుడు రామచంద్రరావుకు సిబ్బంది ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.
News September 17, 2025
ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.