News March 22, 2025

పెద్దపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌‌లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

image

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.

News November 15, 2025

నీ వాటా ఎంత పవన్ కళ్యాణ్: వైసీపీ

image

యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. ‘పవన్ పీఏ, జనసేన ఎమ్మెల్యే మధ్య పంపకాల్లో తేడాలు, రూ.350 కోట్లు విలువైన భూమిని సెటిల్‌మెంట్ చేసిన పవన్ పీఏ.. వాటా కోసం ఎగబడిన యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. బాధితుల్ని గాలికి వదిలేసి.. గుట్టుచప్పుడు కాకుండా సయోధ్యకి పవన్ ప్రయత్నిస్తున్నారు’. ఇందులో నీ వాటా ఎంత అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసింది.

News November 15, 2025

ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.