News March 11, 2025
పెద్దపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలకు నేడు 207 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. గణితం, ఔషధశాస్రం, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5845 మంది విద్యార్థులకు గాను 5638 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 207 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గైర్హాజరైన వారిలో జనరల్ 137, వొకేషనల్ 70మంది ఉన్నారని తెలిపారు.
Similar News
News December 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్
News December 5, 2025
సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.
News December 5, 2025
సీఎం స్టాలిన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.


