News March 11, 2025

పెద్దపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలకు నేడు 207 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. గణితం, ఔషధశాస్రం, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5845 మంది విద్యార్థులకు గాను 5638 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 207 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గైర్హాజరైన వారిలో జనరల్ 137, వొకేషనల్ 70మంది ఉన్నారని తెలిపారు.

Similar News

News December 4, 2025

MDK: ఎన్నికల దావత్‌కు.. అందరూ ఆహ్వానితులే!

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు నగర మోగింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐతే ఉమ్మడి మెదక్ జిల్లా గ్రామాల్లో ఎన్నికల దావత్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తమ అనుచరులు తమవెంట ఉండాలని ప్రతి రోజు దావత్‌లు ఇస్తున్నారు. ఇక పల్లెల్లో ముక్క, చుక్కలకు కొదువ లేదు. ఉదయం టిఫిన్‌లతో సహా రాత్రి దావత్‌ల వరకు ఎలాంటి డొక లేకుండా అందరూ ఆహ్వానితులే.. అంటున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.

News December 4, 2025

వర్ధన్నపేట ఇన్‌ఛార్జి.. ఎర్రబెల్లి VS దాస్యం

image

బీఆర్‌ఎస్‌ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు – దాస్యం వినయభాస్కర్‌ వర్గాల మధ్య విభేదాలు కలకలం రేపుతున్నాయి. ఇన్‌ఛార్జి బాధ్యతలపై ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బహిరంగమైంది. హసన్‌పర్తి, ఐనవోలు మండలాలపై హస్తక్షేపం విషయంలో నెలకొన్న అసంతృప్తి కారణంగా, జీపీ ఎన్నికల్లో పార్టీ సమన్వయంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది.

News December 4, 2025

‘మీ మొబైల్ – మీ ఇంటికి’

image

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం మొదలవుతోంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, నేరుగా యజమానుల ఇంటి వద్దకే వెళ్లి అందించేందుకు ‘మీ మొబైల్ – మీ ఇంటికి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సేవలతో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు పదేపదే రావాల్సిన అవసరం తప్పుతుంది. నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా మొబైల్‌లను ఎస్పీ అధికారులు తెలిపారు.