News April 22, 2025
పెద్దపల్లి: ఈనెల 30లోపు రాజీవ్ యువ వికాసం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

ఈనెల 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. DRDO కాలిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
Inter Results.. గద్వాల జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో గద్వాల జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్లో 59.25 శాతం మంది పాసయ్యారు. 4,054 మంది పరీక్షలు రాయగా 2,402 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్లో 68.34 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 3,616 మంది పరీక్షలు రాయగా 2,471 మంది ఉత్తీర్ణత సాధించారు.
News April 22, 2025
జగిత్యాల: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 55.00 శాతం

ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 7,073 మందికి 3.890 మంది పాసయ్యారు. 55.00-శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్లో 6.173 మంది పరీక్షలు రాయగా 4.220 మంది పాసయ్యారు. 68.36 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
INTER RESULT: ఆసిఫాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 4,756 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 3,354 మంది పాసయ్యారు. 70.52.% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్లో 4,920 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,948 మంది పాసయ్యారు. 80.24% ఉతీర్ణత సాధించారు.