News February 1, 2025
పెద్దపల్లి: ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఐరవేణి రామక్క (90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
Similar News
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
HYD: ప్రాణం పోతేనే పట్టించుకుంటారా? సారూ!

మేడ్చల్-బౌరంపేట్ రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడి ఉన్నాయని ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. గుంతలో పడి ప్రాణం పోతే కానీ పట్టించుకోరా..? సారూ..? అని ప్రశ్నించారు. అత్యంత ప్రమాదకరంగా రోడ్డుపై గుంతలు ఉన్నాయి. రోడ్డుపై ఏర్పడే గుంతలు ప్రాణాలు తీస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
News November 6, 2025
సిరిసిల్ల: ఆఫీసర్కు దక్కిన అరుదైన గౌరవం..!

తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన ఇందిరమ్మ గృహం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి అధికారులు అన్నీ ఏర్పాట్లను చేసి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో హాజరైన కలెక్టర్ హౌసింగ్ AE అబ్దుల్ హమీద్తో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం జరిపిచండంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఏఈ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.


