News February 1, 2025
పెద్దపల్లి: ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఐరవేణి రామక్క (90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
Similar News
News March 13, 2025
పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
News March 13, 2025
MNCL: పోలీసు అధికారులకు సీపీ కీలక సూచనలు..

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండడంలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో జరిగే ప్రతి విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన, సమాచారం ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
News March 13, 2025
పీ 4 సర్వేతో ప్రతీ గృహానికి లబ్ధి చేకూరుతుంది: కలెక్టర్

ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బుధవారం విజయవాడ కలెక్టరేట్ ఛాంబర్లో ప్రణాళిక శాఖ రూపొందించిన అవగాహన, క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్నును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 దిశగా ముందుకు వెళుతుందన్నారు.