News February 1, 2025
పెద్దపల్లి ఎదురుచూస్తోంది.. నిర్మలమ్మ కరుణించేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పెద్దపల్లి జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించడం, ఉడాన్ పథకంలో బసంత్ నగర్కు చోటు కల్పించడం, రామగుండంలో రైల్వే కోచ్ ఏర్పాటు, PDPLలో పలు రైళ్ల హాల్టింగ్ కల్పించాలని తదితర డిమాండ్లు ఉన్నాయి.
Similar News
News November 10, 2025
అయిజ: పత్తి రైతులకు స్లాట్ బుకింగ్ అవకాశం

గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో నవంబర్ 17న పత్తి విక్రయించేందుకు రైతులు సోమవారం ఉదయం 8:30 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని అయిజ ఏఓ జనార్ధన్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు 17న గద్వాల బాలాజీ కాటన్ మిల్ లేదా అలంపూర్ వరసిద్ధి వినాయక కాటన్ మిల్స్లో పత్తి విక్రయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 10, 2025
కలలో శివయ్య కనిపిస్తే..?

‘కలలో శివుడిని/శివ లింగాన్ని చూడటం పవిత్రమైన సంకేతం. కలలో శివలింగం కనిపిస్తే దీర్ఘకాల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. పరమేశ్వరుని దర్శనం లభిస్తే, మీ ఆదాయం పెరిగి, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివుని మెడలో పాము కనిపిస్తే ఆర్థిక లాభాలుంటాయి. త్రిశూలం కనిపిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది’ అని స్వప్న శాస్త్రం చెబుతోంది.
News November 10, 2025
వారంతా మూర్ఖులు: ట్రంప్

తన పాలసీ టారిఫ్లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారిందని చెప్పారు. టారిఫ్ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయని ప్రతి అమెరికన్కూ కనీసం 2వేల డాలర్ల చొప్పున డివిడెంట్ ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించడం ప్రారంభిస్తామన్నారు.


