News January 24, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్యే సొంత డబ్బులతో రాజమల్లు విగ్రహం ఏర్పాటు

image

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు లేనిలోటు తీర్చలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన నాయకుడు రాజమల్లు అని ఆయన కొనియాడారు. శుక్రవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడలి వద్ద రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

Similar News

News February 18, 2025

ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News February 18, 2025

పిట్లం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరొకరికి పరిస్థితి విషమం

image

పిట్లం శివారులోని NH- 161 పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

ADB: కత్తిపోట్ల ఘటన UPDATE

image

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.

error: Content is protected !!