News February 22, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కేమేరా: సీఈఓ

image

ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ లతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరా లేదా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు జాగ్రత్తగా పోలీస్ భద్రతతో కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్లు కోయ శ్రీహర్ష, దాసరి వేణు తదితరులు ఉన్నారు.

Similar News

News October 24, 2025

రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.

News October 24, 2025

సీటింగ్ పర్మిషన్ తీసుకొని!

image

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్‌కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్‌గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూ‌డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్‌ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆల్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్‌ జరిగింది.

News October 24, 2025

లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

image

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్‌ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్‌ బ్రీతబుల్‌ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.