News July 10, 2024

పెద్దపల్లి: ఏడో తరగతి విద్యార్థి మృతి

image

ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. SI సాంబమూర్తి వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలానికి చెందిన సదయ్య కుమారుడు శ్రీవత్సవ్‌(13)కు ఒక కన్ను కనిపించకపోవడంతో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో ఆరేళ్ల క్రితం చేర్పించారు. అయితే బాలుడు
దుస్తులు ఆరవేసే తీగపై ఉన్న టవల్‌ను మెడకు చుట్టుకొని ఆడుకుంటుండగా మరణించినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 23, 2025

KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ

image

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.

News November 22, 2025

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

image

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్‌గా అంజన్ కుమార్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, అధిష్ఠానం మేడిపల్లి సత్యం, అంజన్ కుమార్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది.

News November 22, 2025

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

image

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్‌గా అంజన్ కుమార్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, అధిష్ఠానం మేడిపల్లి సత్యం, అంజన్ కుమార్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది.