News February 22, 2025

పెద్దపల్లి: కాంగ్రెస్ రూ.50వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆరోపించారు.

Similar News

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.

News November 23, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/

News November 23, 2025

NRML: వెడ్మ బొజ్జు పటేల్‌కు పెద్దపీట

image

నిర్మల్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నియమితులయ్యారు. ఆదివాసీ నేతగా ఏజెన్సీ ప్రాంత సమస్యలపై బొజ్జు పటేల్ అనేక ఉద్యమాలు చేశారు. టీపీసీసీ కార్యదర్శిగా ఉన్నప్పుడే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి జిల్లాలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, పోరాటపటిమ ఆయనకు పదవి రావడానికి కారణం.