News February 22, 2025

పెద్దపల్లి: కాంగ్రెస్ రూ.50వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆరోపించారు.

Similar News

News December 6, 2025

విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

image

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.

News December 6, 2025

అనంత: చలిమంట కాచుకుంటూ వ్యక్తి మృతి

image

డి.హిరేహాల్ మండల కేంద్రంలో చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సిద్దేశ్ గత నెల 30న చలిమంట కాచుకుంటూ ఉండగా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News December 6, 2025

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల నియమావళిని పాటిస్తూ సరైన విధంగా నిర్వహించాలని అధికారులను వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ మూడు దశలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి(కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.