News June 7, 2024
పెద్దపల్లి: కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్.. ఒకరి మృతి

పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రైతు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News November 17, 2025
KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
News November 17, 2025
KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.


