News January 25, 2025
పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో నూతనంగా 4పథకాల అమలు కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ఆన్లైన్లో నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 9గంటలకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని.. దీనికి జిల్లాలోని ప్రజలు హాజరవ్వాలని అధికారులు కోరారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News November 11, 2025
భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.
News November 11, 2025
జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.


