News January 25, 2025

పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో నూతనంగా 4పథకాల అమలు కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్‌లో నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 9గంటలకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని.. దీనికి జిల్లాలోని ప్రజలు హాజరవ్వాలని అధికారులు కోరారు.

Similar News

News November 23, 2025

ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

image

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్‌మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2025

ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

image

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్‌మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2025

వాహనదారులకు అలర్ట్.. ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే..

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.